(Jaibharathvoice news వరంగల్, 8 డిసెంబర్)
మీసేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు.ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా 8వ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో ఆదివారం వరంగల్ మీ సేవా ఆధ్వర్యంలో పోచమ్మ మైదానం నుండి ఎం జి ఎం వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన వందలాది మందికిమీసేవా కేంద్రాల ద్వారా రెవెన్యూ శాఖ 250కు పైగా అందిస్తున్న సేవలను ప్రజలు, రైతులు, విద్యార్థులు వినియోగించు కోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ విజయలక్ష్మి, జిల్లా యువజన క్రీడల అధికారి సత్య వాణి, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజ్ కుమార్, మీసేవా, ఈ సేవా ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

previous post