Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డుకు నత్తి కోర్నేల్ ఎంపిక

(జై భారత్ వాయిస్. న్యూస్ ఆత్మకూరు ):
ఆత్మకూరు మాజీ ఎంపీటీసీ నత్తి కోర్నెల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యారని బహుజన సాహిత్య అకాడమి జాతీయ అధ్యక్షుడు నల్లా రాధా కృష్ణ తెలిపారు. ఈ జాతీయ అవార్డును ఈనెల 15వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన సభలో తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అవార్డు అందుకుంటున్న సందర్భంగా నత్తి కోర్నెల్ మాట్లాడుతూ కుల సంఘాలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సేవా సంస్థలు, మేధావుల ప్రోద్బలంతో నే ఈ అవార్డు వచ్చిందని అన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాని తెలిపారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించి సమ సమాజ స్థాపనకు కృషి చేస్తానని అంబేద్కర్ పూలే ల ఆలోచన స్ఫూర్తితో ముందుకు సాగుతానని తెలిపారు.

Related posts

అత్మకూరు పాఠశాల ను ఆకస్మికంగాచేసిన కలెక్టర్ ప్రావీణ్య.-పరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం

ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు మొదటి బహుమతి!

Jaibharath News

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు