(జై భారత్ వాయిస్. న్యూస్ ఆత్మకూరు ):
ఆత్మకూరు మాజీ ఎంపీటీసీ నత్తి కోర్నెల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యారని బహుజన సాహిత్య అకాడమి జాతీయ అధ్యక్షుడు నల్లా రాధా కృష్ణ తెలిపారు. ఈ జాతీయ అవార్డును ఈనెల 15వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన సభలో తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అవార్డు అందుకుంటున్న సందర్భంగా నత్తి కోర్నెల్ మాట్లాడుతూ కుల సంఘాలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సేవా సంస్థలు, మేధావుల ప్రోద్బలంతో నే ఈ అవార్డు వచ్చిందని అన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాని తెలిపారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించి సమ సమాజ స్థాపనకు కృషి చేస్తానని అంబేద్కర్ పూలే ల ఆలోచన స్ఫూర్తితో ముందుకు సాగుతానని తెలిపారు.

previous post