Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

డిసెంబర్ 25 నుంచి జనవరి 9 వరకు రైళ్ల రాకపోకలకు అంతరాయం

కాజీపేట-కొండపల్లి సెక్షన్‌లోని మోటమర్రి రైల్వే స్టేషన్‌ వద్ద మూడో రైల్వే లైను నిర్మాణంలో భాగంగా చేపట్టనున్న నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల దృష్ట్యా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా ఇంకొన్నింటిని దారి మళ్లించింది. ఈ మేరకు అన్ని రైల్వేస్టేషన్లకు ఉత్తర్వులు పంపింది. ఈ నెల 25 నుంచి జనవరి 9 వరకు పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది.*

*రద్దయిన రైళ్లు*:

డిసెంబరు 25- జనవరి 9 మధ్య.. కాజీపేట-డోర్నకల్‌ మెమూ(07753), డోర్నకల్‌-కాజీపేట మెమూ(07754), డోర్నకల్‌-విజయవాడ మెమూ(07755),  విజయవాడ-డోర్నకల్‌ మెమూ(07756), విజయవాడ-భద్రాచలం రోడ్డు మెమూ(07979), భద్రాచలం రోడ్డు-విజయవాడ మెమూ(07278) డిసెంబరు 28, 29, జనవరి 02, 05, 07, 08, 09 తేదీల్లో.. నంబరు 12705 గుంటూరు-సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్, నం.12706 సికింద్రాబాద్‌-గుంటూరు ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్‌. డిసెంబరు 27, జనవరి 01, 04, 07, 08, 09 తేదీల్లో.. నంబరు 12713 విజయవాడ-సికింద్రాబాద్‌ శాతవాహన ఎక్స్‌ప్రెస్, నం.12714 సికింద్రాబాద్‌-విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దయ్యాయి.*

*పాక్షికంగా రద్దు:*

డిసెంబరు 27- జనవరి 09 మధ్య… నంబరు 17201 గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ గుంటూరు-కాజీపేట, నం.17202 గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట-గుంటూరు రైలును రద్దు చేసింది. దూర ప్రాంతాల మధ్య నడిచే పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దారి మళ్లించింది. జనవరి 07, 08, 09 తేదీల్లో నంబరు 20834 విశాఖపట్నం వందేభారత్‌ రైలు, డిసెంబరు 27, 28, జనవరి 01, 04, 06, 07, 08 తేదీల్లో నం.17406 ఆదిలాబాద్‌-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలును రీ-షెడ్యూల్‌ చేశారు.*

Related posts

ఒగ్లాపూర్ లో బిఆర్ఎస్ నుండి  బీజేపీ లో భారీగా చేరికలు

రజిని కి జిల్లా ఉత్తమ ఉపాద్యాయ అవార్డు

Jaibharath News

బుధరావుపేటలో విశ్వకర్మ జయంతి వేడుకలు

Sambasivarao