( జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో వున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏ అప్పయ్య అన్నారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ చేశారు. చుట్టూ పరిసరాలను, ల్యాబ్ ను, ఫార్మసీని పరిశీలించిన అక్కడే ఉన్న వృద్ధులకు, స్వయంగా వైద్య సేవలు అందించారు. వారితో మాట్లాడుతూ వైద్యులు సమయానికి వస్తున్నారా? మీకు సరైన వైద్య సేవలు అందిస్తున్నారా అంటూ ఆరా తీశారు. జిల్లా వైద్య అధికారి మాట్లాడుతూ ప్రజలందరూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు ఉచితంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండలంలో అలాగే అక్కంపేట పెద్దాపూర్ గ్రామాలలో కూడా పల్లె దావఖానలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని ఎవరికి ఎలాంటి వైద్య సేవలు అవసరం ఉన్న ఉప యోగించు కోవాలన్నారు. అలాగే ప్రతి మంగళవారం మహిళలకు 8 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వాటిని మహిళలు ఉపయోగించుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు సబ్ సెంటర్ లను కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నర్సింగారావు, తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు

previous post