Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

రాష్ట్రస్థాయి సీఎం కప్ యోగా పోటీలకు పత్తిపాక విద్యార్థులు     

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
హనుమకొండ జిల్లా కేంద్రంలోని జె ఎన్ ఎస్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రతిష్టాత్మకమైన చీఫ్ మినిస్టర్ కప్ అండర్ 19 యోగా పోటీలలో శాయంపేట మండలం పత్తిపాక ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.  30 డిసెంబర్ నుండి 3జనవరి2025 వరకు హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం హైదరాబాదులో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించబడతాయి. పాఠశాల నుండి గడ్డి నవదీప్ రిథమిక్ యోగ,  గజ్జి వరుణ్ ఆర్టిస్టిక్ యోగ,   గజ్జి రాజేష్, సిలివేరు వరుణ్ ట్రెడిషనల్ యోగ స్థానాలలో  రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నారు. వీరి ఎంపికకు కృషిచేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు బొలిశెట్టి కమలాకర్ ను ప్రధానోపాధ్యాయులు మాధవి ఉపాధ్యాయులు రఘు అనిత సోంబాబు విజయ్ కుమార్ కిరణ్మయి. విజయ రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు  అభినందించారు.

Related posts

ఏరుకొండ రాజేష్ మృతదేహాన్ని సందర్శించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి,

కబడ్డీ క్రీడలలో జాతీయస్థాయికి ఎదగాలి

పేదల సంక్షేమానికి రాజీపడేది లేదు :పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి