Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఇచ్చిన మాటకు కట్టుబడి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము

  • ఇచ్చిన మాటకు కట్టుబడి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము
  • పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
    (జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
    అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకుంటామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో మోడల్ ఇందిరమ్మ భవనానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఒక్క డబుల్ బెడ్ రూము లు ఇవ్వని ఘనత గటప్రభుత్వానిదేనని ఆరోపించారు. సొంత ప్రయోజనాల కోసం పాకులాడిన వారే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ప్రకారం రాష్ట్రం అప్పులపాల్లో ఉన్నా కూడా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ గృహాలు అందించి సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా అందజేస్తామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని వాటిని నిరుపేదలకు అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఉద్యమ కారులను ఆదుకోవాలి.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతఆత్మకూరు ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి

ఆత్మకూరు మండలాన్ని అభివృద్ధి చేస్తా.- ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

Jaibharath News