జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి పేదకు లబ్ధి చేకూరేవిధంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి , ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఆదివారం హనుమకొండ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మాత్యులు కొండ సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్,మహిళ శిశు సంక్షేమ శాఖామంత్రి దనసరి అనసూయ సితక్క, రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రు నాయక్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కె ఆర్ నాగరాజ్, తెల్లం వెంకట్రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా హౌసింగ్ స్పెషల్ ఆఫీసర్ వినయ్ కృష్ణారెడ్డిలతో కలసి *రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల,రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాల అమలుపై జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యాచరణ సమన్వయ సమావేశంలో* *రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి* కులంకషంగా సమీక్షించి సమర్థ నిర్వహణకు జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, షేక్ రైజ్వాన్ బాషా, దివాకర, కుడా చైర్మన్ ఇనగల వెంకటరామిరెడ్డి, ఐటిడిఎ పి ఓ మిశ్రా, ఆరు జిల్లాల ఆదనవు కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగాఆయా జిల్లాలకు సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, తదితర అంశాలపై గ్రామ, వార్డు సభలను ఏ విధంగా నిర్వహిస్తున్నారు, అధికారుల బృందాలను ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, కార్యాచరణ కు సంబంధించిన వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు,అదనపు కలెక్టర్లు వివరించారు.
అనంతరం *రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి , ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి* మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26వ తేదీన ఈ నాలుగు పథకాలను ప్రారంభించనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదోడి కల నెరవేర్చేందుకు కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాల అమలు చేయడంలో జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లు ఇతర అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోనే రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలను ఇచ్చిందని, నియమ నిబంధనల ప్రకారమే కొత్త రేషన్ కార్డులు జారీ ఉంటుందన్నారు. కుటుంబాన్ని ఒక యూనిట్ గా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వమే అర్హులకు కొత్తగా రేషన్ కార్డులు అందజేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలనేదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు ఇందిరమ్మ కమిటీల సమక్షంలో గ్రామ సభలను నిర్వహించాలన్నారు.
ఈ నాలుగు పథకాల అమలుపై గ్రామస్థాయిలో మున్సిపల్ స్థాయిలో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి లిస్టులను వార్డు వద్ద ఉండే విధంగా చూడాలని, గ్రామసభ నిర్వహించే ముందు ఆయా ప్రాంతంలో టామ్ టామ్ వేయించాలని తెలిపారు. రాబోయే ఉగాది నుండి పౌర సరఫరాల దుకాణాలలో సన్నబియ్యం ఇవ్వటానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆయన తెలియజేశారు. గ్రామస్థాయి, మున్సిపల్ స్థాయిలో పర్యటించే బృందంలో వ్యవసాయ రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లో భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి రెండు విడుతలుగా 12,000 అందజేయడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు అవకాశం ఇవ్వాలని అన్నారు.
గ్రామ వార్డు సభల నిర్వహణ చేసేటపుడు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.

*రాష్ట్ర పర్యావరణ,అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ* మాట్లాడుతూ సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతున్నదన్నారు. విద్య, వైద్యం, సంక్షేమం, తదితర అంశాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, అందులో భాగంగా ఈనెల 26వ తేదీ నుండి ప్రభుత్వం నాలుగు ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు , ఇందిరమ్మా కమిటీల సమన్వయంతో అమలు చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు అవసరమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డులను అందించేందుకు కృషి చేస్తున్నారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలను అత్యంత పారదర్శకంగా అందజేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందజేయాలన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.
*రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క* మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి స్వయంగా కలెక్టర్లకు మార్గం నిర్దేశం చేశారన్నారు. అత్యంత జాగ్రత్తగా లబ్ధిదారుల ఎంపిక చేసి అత్యంత నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. సాగులో ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. గ్రామ సభల వివరాలు మందస్తుగానే గ్రామాల్లో ప్రదర్శించాలని అన్నారు. గ్రామసభలను గురించి ఆయా గ్రామాల ప్రజలకు తెలిసే విధంగా అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రజా సంక్షేమమే బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న వారథులు అధికారులేనని అన్నారు. అర్హులకు తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలు అందాలన్నారు. దేశంలో రాజ్యాంగంలోకి వచ్చిన జనవరి 26న పేదోళ్ల అసలైన పండుగ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకెళ్లాలన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకు వస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలపై హనుమకొండ జిల్లాకు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. రైతు భరోసా కి సంబంధించి రెవెన్యూ గ్రామసభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామన్నారు. గ్రామ, వార్డు సభలలో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హులకు కొత్త రేషన్ కార్డులను అందజేస్తామన్నారు. జిల్లా అధికారులను మండల స్థాయి ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు తెలిపారు. ఈనెల 21వ తేదీ నుంచి గ్రామ, వార్డు సభలను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. గ్రామ వార్డు సభలను ప్రకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్లు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
*వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా* మాట్లాడుతూ జిల్లాలోని 13 మండలాల్లోని 186 రెవిన్యూ గ్రామాలకు 158 బృందాలను నియమిస్తూ నాలుగు పథకాలకు సంబంధించి షెడ్యూల్ తయారు చేయడం జరిగిందని, 16 నుంచి 20 వరకు ఆయా శాఖల బృందాలు క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులలో అర్హులను గుర్తించి 21 నుంచి 24 వరకు ఆయా గ్రామ సభల్లో మున్సిపల్ వార్డులలో లిస్టులను ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. రైతు భరోసా లో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యవసాయ యోగ్యం భూములను గుర్తించడం, కొత్త రేషన్ కార్డులు ఎంపికలు బృందాలుగా వెళ్లి నిజమైన అర్హులను ఎంపిక చేయనున్నట్లు కలెక్టర్ అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లో భూమిలేని వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనిలో జాబ్ కార్డులు కలిగిన వారిని పరిగణలోకి తీసుకుని ఎంపిక చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ మాట్లాడుతూ నాలుగో ప్రభుత్వ పథకాలను సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రజలకు అందించబోతున్నామని అన్నారు. అందుకు ముఖ్యమంత్రి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను కలెక్టర్లు,అధికారులు లబ్ధిదారులకు అదే విధంగా కృషి చేయాలన్నారు.
గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో సుమారు 3 వేల మంది వివరాలు మిస్సయినాయని ఆయా వివరాలు నమోదు చేయుటకు గాను ఎడిట్ ఆప్షన్ కేటాయించాలని కోరగా ఇంచార్జ్ మంత్రి సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ గ్రామ, వార్డు సభల నిర్వహించేటప్పుడు ఒక రోజంతా అదే గ్రామ సభలో పాల్గొనాలన్నారు. గ్రామపంచాయతీల వారిగా గ్రామసభలను నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ అమల్లోకి తీసుకొస్తున్న నాలుగు పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల మార్గదర్శకాలు, భూ సమస్యలకు సంబంధించిన అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా ఛైర్మన్ వెంకట్రాం రెడ్డి మాట్లాడారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిశీలకులు వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ నిర్దేశించిన పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేస్తామన్నారు.
*అనంతరం కాన్ఫరెన్స్ హాల్ లో* మీడియాతో *రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి* మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలతో పాటు అభివృద్ధిని సంక్షేమాన్ని సమ ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదోడి కలను నెరవేర్చాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పటై రెండో సంవత్సరంలో అడుగు పెటట్టామని ప్రత్యేక శ్రద్ధతో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. జనవరి 26వ తేదీ నాడు 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పేదవాడి ప్రతి ఇంటికి ఇందిరమ్మ ప్రభుత్వ ఫలాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.అదేవిధంగా రైతు భరోసా.. రైతన్నను రాజు చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతును రాజు చేయాలని ఉద్దేశంతో 12 వేల రూపాయలను రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం అందించనుందన్నారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలనేదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసాను అందిస్తామన్నారు. అర్హులైన, వ్యవసాయోగమైన ప్రతి ఎకరాకు సంవత్సరానికి రెండు విడతలుగా రెండు పంటలకు రైతుభరోసాను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా నాలుగు స్కీములే కాకుండా, ప్రతి కార్యక్రమాన్ని, చట్టాన్ని ప్రజల ముందు పెడుతుందన్నారు. ప్రతి గ్రామంలో అధికారులు గ్రామ సభ పెట్టి నాలుగు పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్నారు. జనవరి 26 నుంచి నాలుగు ప్రభుత్వ పథకాలు పంపిణీ కాబోతున్నాయని అన్నారు. రైతు భరోసా ఎంపికలో ఎలాంటి పక్షపాతం లేదన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. కొత్త రేషన్ కార్డుల విషయాన్ని ప్రస్తావిస్తూ గత ప్రభుత్వం ఒకటి రెండు కార్డులు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. అర్హులకు ఇందిరమ్మ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇస్తుందన్నారు. కొత్త రేషన్ కార్డులకు ఎలాంటి రికమండేషన్ లు ఉండవన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డు అదేవిధంగా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా రెండు విడతలుగా 12 వేల రూపాయలను వ్యవసాయ రైతు కూలీలకు అందిస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు అందించడం అనేది నిరంతరం ప్రక్రియ అని పేర్కొన్నారు. వీటి విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడంలో జిల్లా కలెక్టర్లు కృషి చేయాలని, ప్రతి గ్రామంలో గ్రామసభను ఒకరోజు పాటు నిర్వహించాలన్నారు. గ్రామసభలు ప్రశాంత వాతావరణంలో జరగాలన్నారు. ప్రభుత్వానికి అధికారులకు మంచి పేరు వచ్చే విధంగా నిస్పక్షపాతంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. అర్హులైన వారు ఎంతమంది ఉన్నా నాలుగు ప్రభుత్వ పథకాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వెనకడుగు వేయదన్నారు. ఎక్కడ చిన్న తప్పిదం జరగకుండా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి లబ్ధిదారున్ని ఎంపిక చేసేందుకు కలెక్టర్లు కృషి చేయాలన్నారు. జిల్లాలో ఏ కార్యక్రమం జరుగుతుందో కలెక్టర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొక్కుబడిగా చేయకుండా చిత్తశుద్ధితో అధికారులు ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించేందుకు కలెక్టర్లు, అధికారులు కృషి చేయాలన్నారు.