Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

యువత చేడు వ్యసనాలకు దూరంగా ఉండాలి : నెహ్రు యువజన కేంద్రం జిల్లా అధికారి అన్వేష్

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
వరంగల్ జిల్లా గీసుకొండ  ఆదర్శ గ్రామం గంగదేవి పల్లి గ్రామం లో సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఘనంగా ప్రాంభమైనాయి. కార్యక్రమంకు ముఖ్య అతిధిగా జిల్లా నెహ్రు యువజన కేంద్రం అధికారి సి. హెచ్ అన్వేష్ హాజరై యువత క్రీడల్ల రాణించాలని అన్నారు. యువత చేడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు.కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం కోఆర్డినేటర్ కొక్కొండ శ్రీకాంత్ మాట్లాడుతూ  క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని అన్నారు. గంగాదేవిపల్లి మాజీ సర్పంచ్ డిస్టిక్ ట్రైనింగ్ మేనేజర్ కోసం రాజమౌళి  మాట్లాడుతూ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఎలాంటి వ్యక్తిగతంగా విజయాన్ని ఓటమిని తీసుకోకూడదు అని అన్నారు.  మాజీ సర్పంచ్ గోనెమల్లారెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలను ఈ క్రికెట్ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు పగడాల రాజు కుమార్ మాట్లాడుతూ యువత దేశానికి సంపద అని యువతను కొనియాడారు. కార్యక్రమంలో మంచినీటి నిర్వహణ కమిటీ అధ్యక్షులు గోనె నాగరాజు, గాదం శ్రీనివాస్, ఏరుకొండ రాజ్  కుమార్ , విష్ణు,శ్రీనివాసు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు గడ్డమీది బాలరాజు, సల్ల సాంబరాజు, నాగిశెట్టి సతీష్ ,బాబు గోనె ఐలయ్య, సింగిరెడ్డి అనిల్ ,పెండ్లి వినయ్, పెండ్లి వేణు, చల్లా ప్రణయ్, పెండ్లి హేమంత్ పాల్గొన్నారు.కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా క్రికెట్ పోటీల ఆర్గనైజర్ మాడిశెట్టి రాముడు అధ్యక్షత వహించారు. మొండ్రాయి, క్రిస్టియన్ కాలనీ టీంలకు నెహ్రూ యువజన కేంద్రం జిల్లా అధికారి సిహెచ్ అన్వేష్ టాస్ వేసి ఆటను ప్రారంభించారు. యువకులు, క్రికెట్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

Sambasivarao

శ్రీరామకృష్ణ మోడల్ స్కూల్ లో శ్రీకృష్ణ జన్మష్టామి వేడుకలు

మల్టీ పర్పస్ వర్కర్ల సేవలు మరువలేనివి.-వారి పాదాలు కడుగుతాం.