జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలో గల శ్రీ వేణుగోపాల స్వామి సహిత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో గురువారం నాడు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఎమ్మేల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి సహకరిస్తానని, పరకాల నియోజకవర్గం ప్రజల పైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని కోరారు.
