April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జామాయిల్ తోట దగ్ధం


(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ):
ఏపుగా పెరిగిన జామాయిల్ తోటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్
తోట మొత్తం దగ్ధమైన సంఘటన శాయంపేట మండలం పత్తిపాక శివారులో చోటుచేసుకుంది. బుధవారం అందిన వివరాల ప్రకారం ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన బూర పద్మ, బూర రమేష్ చెందిన మూడు ఎకరాల వ్యవసాయ భూమిలో జామాయిల్ తోట సాగు చేస్తున్నారు. బుధవారం విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్ తో జామాయిల్ తోట మొత్తం దగ్ధమైంది. చేతికి వచ్చిన పంట దాదాపు 5 లక్షల పైన విలువ చేసే కర్ర అగ్నికి ఆహుతైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు

Related posts

విధుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.- వరంగల్ పోలీసు కమీషనర్

Jaibharath News

అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ -2023 ఎంజెపి విద్యార్థుల ప్రతిభ

Jaibharath News

పేదల సంక్షేమానికి రాజీపడేది లేదు :పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి