Jaibharathvoice.com | Telugu News App In Telangana
గుంటూరు

వేంకటేశ్వరస్వామివారికి   పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం  చంద్ర‌బాబు

జై భారత్ వాయిస్ న్యూస్ అమరావతి
అమరావతి రాజధాని వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్ర‌బాబు నాయుడు  స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి కళ్యాణ వేదిక వద్దకు చేరుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి  ఆనంరామనారాయణరెడ్డి టీటీడీ ఛైర్మన్  బీఆర్ నాయుడు, ఈ ఓ జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈఓసిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

పసుపుచీర కట్టుకున్న వారంతా ఎంఅవుతారో తెలుసా

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: ఐజీ త్రిపాఠి

Jaibharath News

క్రిస్మస్‌ పర్వదినం క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ సిఎం వైయస్‌ జగన్‌  శుభాకాంక్షలు