Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది-మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం చట్టసభలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవోను విడుదల చేసిన ప్రభుత్వానికి బీసీలు రుణపడి ఉంటారని ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్ అన్నారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రముకు పంపించారన్నారు. భారతదేశంలో బీసీలు 56 శాతం ఉంటే కేవలం 29 శాతం మాత్రమే రిజర్వేషన్ ఉన్నది. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ చేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలని కేంద్రంలో డిమాండ్ చేశారనీ చెప్పారు. బీసీల సంక్షేమం కోసం కట్టుబడిన రేవంత్ రెడ్డి కి బీసీ లందరూ అండగా నిలిచి ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత పర్వతగిరి రాజు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రేవూరి రణధీర్ రెడ్డి, పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు, జిల్లా కాంగ్రెస్ నాయకులు కక్కెర్ల రాజు గౌడ్, బోరీగం స్వామి, ఉడుత రాజేందర్, మాజీ సర్పంచ్ లు బండి శ్రీనివాస్,కంచ కుమారస్వామి, మాజీ సొసైటీ చైర్మన్ ఏడుకొండ రవీందర్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ ముద్దం సాంబయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు కృష్ణంరాజు, తనుగుల సందీప్, బరుపట్ల కిరీటి, భయ్యా కుమారస్వామి, వడ్డేపల్లి ప్రసాద్, పొనుగోటి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు

Related posts

ఎస్సై కొడుకు రికార్డు వండర్ కిడ్ ను అభినందించిన పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝ

శ్రీ అక్షయ ధరిని చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు అరెస్టు

Sambasivarao

ఆత్మకూరు నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులు

Jaibharath News