Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

క్షయ వ్యాధి లక్షణములు మరియు జాగ్రత్తల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

మార్చి 24, ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ నగరం కాజీపేట్ లోని డీజిల్ లోకో షెడ్ లో క్షయ వ్యాధి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. లోకో షెడ్ లో పని చేస్తున్న దాదాపు 400 మంది సిబ్బంది ఈ సదస్సుకు హాజరు అయ్యారు. ఈ సదస్సులో టిబి నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీమతి హిమబిందు గారు మాట్లాడుతూ టిబి రహిత సమాజo కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇందు కోసం ప్రతి ఒక్కరు క్షయ వ్యాధిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎవరికైనా రెండు వారాల కు మించి దగ్గు, జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, పట్టణ ఆరోగ్య కేంద్రo కు వెళ్ళి తెమడ పరీక్ష చేయించుకోవాలని, ఒకవేళ వ్యాధి నిర్ధారణ జరిగితే ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు నిక్షయ్ పోషణ యోజన ద్వారా మంచి పోషకాహారం తీసుకోవడానికి పోషణార్థం ప్రతినెల 1000 రూపాయలు చొప్పున ఆరు నెలలు వారి యొక్క బ్యాంకు ఖాతాలోనే నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి అశ్రద్ద చేయకుండా మందులు వాడినట్లైతే పూర్తిగా నయం అవుతుందన్నారు. కార్యక్రమంలో రైల్వే వైద్య అధికారి డాక్టర్ ధీరజ్ కుమార్, జిల్లా మాస్ మీడియా అధికారి వి. అశోక్ రెడ్డి వివిధ అంశాలపై అవగాహన కలిగించారు. ఈ సదస్సులో సీనియర్ DME డీజిల్ లోకో షెడ్ NV వెంకట కుమార్, డాక్టర్ ధీరజ్ కుమార్, సోమిడి వైద్య అధికారి డాక్టర్ అనిత, జిల్లా మాస్ మీడియా అధికారి వి. అశోక్ రెడ్డి, జిల్లా క్షయ వ్యాధి సమన్వయ అధికారి సుష్మ , టీబి కోఆర్డినేటర్ పి కిరణ్ కుమార్ మరియు DPPM డి నగేష్ ,సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ టీ విజయ్ టీబి HV లు సునీత, అంజమ్మ, సి‌ఓ జ్యోతి పాల్గొనడం జరిగింది

Related posts

దళితుల అభ్యున్నతి కోసమే దళితబందు పథకం

Jaibharath News

ఆత్మకూరు లో బీరన్న ప్రతిష్టాపన మహోత్సవం.

ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయొద్దు …….