హన్మకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం రాత్రి ఇఫ్తార్ విందు కళాశాల క్యాంటీన్లో ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య. సుంకరి జ్యోతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జ్యోతి మాట్లాడుతూ ముస్లిం సోదరులు 45 రోజులపాటు పవిత్రంగా జరుపుకునే పండుగలలో రంజాన్ చాలా ముఖ్యమైందని. కళాశాలలో అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నామని హిందూ ముస్లిం, క్రిస్టియన్ సాంప్రదాయాలను గౌరవిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుదర్శన్, మహిళా పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మధుశ్రీ, డాక్టర్ . అసీం ఇక్బాల్, డాక్టర్ ఫిరోజ్, ఆర్ట్స్ కళాశాల ఎన్జీవో సంఘం అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి సుశీల్ కళాశాల బోధ నేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
