గీసుకొండ గీసుకొండ వేణుగోపాలస్వామి దేవాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం
గీసుకొండ మండల కేంద్రంలోని రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా, ఘనంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వేదాంతం నరసింహాచార్యులు గారు భక్తులకు తీర్థప్రసాదాలు సమకూర్చగా, పాకాల ప్రభాకర శర్మ గారు ప్రజలకు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈకార్యక్రమంలో దేవాలయ చైర్మన్ ఏనుగుల సాంబరెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు రామా కుమారస్వామి, బండారు నరేందర్, తాటికొండ బ్రహ్మచారి, పాకాల శ్రీనివాస్, కర్ణకంటి రాంమూర్తి -రజిత దంపతులు, వీరాటి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
