(జై భారత్ వాయిస్ ఆత్మకూరు, హన్మకొండ జిల్లా ) జాతీయ హ్యూమన్ రైట్స్ కమిటీ మండల చైర్మన్ గాకొత్తగట్టు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బొల్ల నరేష్ నియమితులయ్యారు.సోమవారం జాతీయ హ్యూమన్ రైట్స్ కమిటీ హన్మకొండ జిల్లా చైర్మన్ దుబాసి నవీన్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్బంగా నరేష్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో హ్యూమన్ రైట్స్ మండల చైర్మన్ గా నియమించిన కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. తనకు ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం సంతోషంగా వుందని అన్నారు. అన్యాయానికి గురైన పేద సామాన్య ప్రజల తరపున ప్రశ్నించడానికి తాను ఎల్లవేళల కృషి చేస్తానని చెప్పారు
.