జై. భారత్ వాయిస్ న్యూస్ .హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బీఏ ,బీకాం ,బీఎస్సీ 4,(నాలుగవ )సెమిస్టర్ ,6(ఆరవ) సెమిస్టర్ పరీక్షలు రెండవ తేదీ బుధవారం నుండి నిర్వహించబడుతుందని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుంకరి జ్యోతి తెలిపారు. ఈ పరీక్షలు 2 నుండి 23 తేదీ వరకు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడతాయని, ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు పరీక్ష సమయానికి అర్థగంట ముందే చేరుకోవాలని పరీక్షల సమయంలో విద్యార్థులకు నీళ్ల వసతి, నిరంతరం కరెంటు వసతిని కల్పించామని పరీక్షలు రాసే విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్ తీసుకొని రావాలని ఆమె పేర్కొన్నారు.

previous post