జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు గురువారం గ్రేటర్ వరంగల్ మునిసిఫల్ కార్పోరేషన్ పరిధిలోని 15వ డివిజన్ మొగిలిచర్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూకాంగ్రెస్ ప్రభుత్వం పేద వర్గాల కోసం ఆహార భద్రత చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు.ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి కుటుంబానికి ఆర్థికపరమైన లబ్ధి చేకూర్చాలని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగస్తులను గౌరవించుకోవాలని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న, ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తామని అన్నారు.పేద ప్రజల ఆకలి తీర్చడంతో పాటు ధనిక పేద తారతమ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సన్న బియ్యం తినాలని లక్ష్యంతో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు. పేదల ఆకలి తీర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజలు దొడ్డుబియ్యం తినేందుకు ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రియజోద్ధిన్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గోన్నారు.
