జై భారత్ వాయిస్ న్యూస్ భద్రాచలం
భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఈ వేడుకలో ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు.మిథిలా స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ,కొండా సురేఖ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి ,, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , అధికారులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.




