Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని అందుకే ప్రైవేట్ రంగంలో జాబ్ మేళా

వరంగల్ (తూర్పు) నియోజక వర్గ పరిధి లోని ఏం కే నాయుడు కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ను రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ( సీతక్క) తో కలిసి రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖశుక్రవారం నాడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.60 కంపెనీల ద్వారా 11 వేల మంది నిరుద్యోగ యువతకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగం కల్పిస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఎన్నికల ముందు చెప్పిన విధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన విధంగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని గత పది సంవత్సరాలలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్యోగాలు లేకుండా పోయాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో నిమగ్నమయ్యారని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని అందుకే జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని అన్నారు .ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ డాక్టర్ .సత్య శారద, బల్దియా కమిషనర్ డాక్టర్ .అశ్విని తానాజీ వాకడే,రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అప్జల్ బియాబాని ఖుస్రూ పాషా, అదనపు కలెక్టర్ సంధ్య రాణి కార్పొరేటర్లు, జిల్లా, జిడబ్ల్యూ ఎంసీ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గోపు విజయ సింధూరి కి ఫార్మసీ లో డాక్టరేట్ పట్టా

దయాకర్ జ్ఞాపకార్థం  విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ

చిన్నారులకు పలకల పంపిణి