(జై భారత్ వాయిస్ నర్సంపేట):
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మనుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ లెవెల్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సెలబ్రేషన్ లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకాని అశోక్ సహ ఉపాధ్యాయులు వాంకుడోత్ వాగ్య ,భూక్య వీరన్న ,వల్లాల అశోక్ ,బిల్లా వెంకటేశ్వర్లు ,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ భూక్యదర్మీ పాల్గొని విద్యార్థులకు ఉత్తీర్ణత పట్టాలు అందించారు. ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ సమావేశం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకాని అశోకు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దామని చెప్పారు. మను బోతుల గడ్డ, బండమీది మామిడి తండ గ్రామాలలోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారు కోరారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని యువకులు యువజన సంఘాలు మహిళా సంఘాలు సహకరించాలని ఆయన కోరారు. అపార అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు విద్య బోధనను అందిస్తున్నామని ఆయన వివరించారు.గ్రామాలలో ముందస్తు బడిబాటను నిర్వహించి పలువురు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించామని చెప్పారు. ఇందుకు ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉన్నదని చెప్పారు. పాఠశాల అభివృద్ధి పనులకు దాతలు సహకరించాలని గ్రామస్తులను కోరారు. ఈ సెలబ్రేషన్లో మహిళలు పిల్లల తల్లిదండ్రులు అంగన్వాడి టీచర్ తేజావత్ కవిత, ఆయా తేజావత్ జ్యోతి విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు
.
