( జై భారత్ వాయిస్ నర్సంపేట): హైదరాబాదులోని త్యాగరాయ గాన సభలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనానికి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మనుబోతుల గడ్డ హైస్కూలు తెలుగు మాస్టర్ కు పాల్గొనే అవకాశం దక్కింది. ఖానాపూర్ మండలం మనుబోతుల గడ్డ ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు స్కూల్ అసిస్టెంట్ బేరె సుధాకర్ త్యాగరాయ గాన సభలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనం లో పాల్గొన్నారు. ఈ కవిసమ్మేళనాన్ని తెలుగు భాషా చైతన్య సమితి ఆంధ్రపరిషత్తు సమ్మిళితంగా నిర్వహించింది .ఈ కవి సమ్మేళనం లో పాల్గొన్న తెలుగు మాస్టర్ సుధాకర్ మాట్లాడుతూ తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాలని తెలుగు భాషకు పట్టాభిషేకం చేయాలని ఆయన కోరారు. దేశ భాష లందు తెలుగు లెస్స అని అన్నారు. సుధాకర్ కవితా గానాన్ని చేసి సభికులను అలరించారు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలుగు మాస్టర్ సుధాకర్ ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అంతర్జాతీయ కవి సమ్మేళనం లో రాణించిన సుధాకర్ ను మనుబోతుల గడ్డ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ జమాండ్ల వెంకన్న, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కాకాని అశోక్, సహా ఉపాధ్యాయులు, గ్రామస్థులు, విద్యాభిమానులు అభినందించారు.
