Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

వైద్య సిబ్బంది, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలి.

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) ఆత్మకూరు మండల కేంద్రం లో
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించవలసిన బాధ్యత ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.
బుధవారం ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించి, మందుల స్టోర్ రూమ్ ను, ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ ప్రవీణ అధికారులకు పలు సూచనలు చేశారు. వైద్య అధికారులు ,సిబ్బందిప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని అన్నారు. గ్రామస్తులు సాయంత్రం వేళ వైద్య సిబ్బంది ఎవరు ఉండటం లేదని కలెక్టర్ దృష్టి తీసుకుపోవడంతో స్పందించిన కలెక్టర్ వెంటనే డిఎంహెచ్వో కు 24 గంటలు వైద్య సేవలు అందే విధంగా చూడాలని ఆదేశాలను జారీ చేశారు. వర్షాకాలం సీజన్లో రైతులు అనారోగ్యాలకు, తేలుకాటు పాము కాటుకు గురై అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కావలసిన మందులను అందుబాటులో ఉంచుకొని ప్రజలకు వైద్య సేవలు అందించాలని సూచించారు . పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని కుట్టు శిక్షణ కేంద్రం ను పరిశీలించి మహిళలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారితో సమావేశం ఏర్పాటు చేసి కుట్టు శిక్షను నేర్చుకున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు. మీకు ఎన్నో అవకాశాలను అందిస్తామని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మీకు అన్ని వసతులు అందుతున్నాయా అని ఆరా తీశారు. బ్యాంకులో వారితో మాట్లాడి మీకు కావాల్సిన రుణ వసతులు కూడా కల్పిస్తామన్నారు. కుట్టు శిక్షణ నేర్చుకున్న మహిళలందరూ ఉపాధిగా ఎంచుకోవాలని సూచించారు. మండలంలోని గూడప్పాడు
గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పనులను పరిశీలించి ఉపాధి హామీ సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. నాణ్యతతో కూడిన పనులు చేయించాలని అప్పుడే మంచి పేరు వస్తుందని సూచించారు. గ్రామంలో అన్ని వసతులు కల్పించి ప్రజలకు సేవలు అందించాలని అధికారులకు సూచించారు. అలాగే మండలంలోని తిరుమలేగిరి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలకు సరైన వసతులు కల్పిస్తున్నారని ఆరా తీశారు. పని చేసిన కూలీలందరికీ కూలీ డబ్బులు అందుతున్నాయా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండుతున్న ఎండలకు కూలీలు ఇబ్బందులు పడకుండా నిల్వ నీడతో పాటు త్రాగునీరు వసతులు కల్పించాలని ఉపాధి హామీ సిబ్బందినీ ఆదేశించారు.. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించినప్పుడే ప్రభుత్వానికి అధికారులకు మంచి పేరు వస్తుందని సూచించారు. అందరూ తమ వంతు కర్తవ్యం గా భావించి పనులు చేయించాలని అలాగే మండలంలోని అన్ని గ్రామాలలో నర్సరీలను పెంచడంతోపాటు పెంచిన మొక్కలు నాటించి వాటిని సంరక్షించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. నిర్లక్ష్యం చేస్తే నాటిన మొక్కలు ఎండిపోవడం వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరు కారు పోతుందని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. వన మహోత్సవ కార్యక్రమంలో ఇంత ఉత్సాహంతో మొక్కలు నాటుతున్నారు అదేవిధంగా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. నాటిన మొక్కలు ఏపిగా పెరిగినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని వాతావరణ కాలుష్యం కూడా తగ్గిపోతుందన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు డి ఎం హెచ్ వో అప్పయ్య, ఎంపీఓ విమల, డిప్యూటీ తాసిల్దార్ భాస్కర చారి, ఏపీవో రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు అన్ని శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సామాజిక పరివర్తనలో యువత కీలక పాత్ర

రాజకీయ పార్టీల నాయకులు సమన్వయం పాటించాలి

Jaibharath News

వడ్డేపల్లిలో నూతన చర్చి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే