Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలి!

(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ )హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 16 సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బోధ నేతర సిబ్బంది ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కర్నాటి ప్రతాపరెడ్డికి వినతిపత్రం ఇచ్చినారు. ఇందులో ప్రధానంగా గత ఆరేడు నెలలుగా కళాశాలకు సహాయక రిజిస్టర్ లేరని, కళాశాల 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళాశాలలో అందంగా తీర్చిదిద్దడం కోసం కావలసిన నిధులను సమకూర్చాలని, అదేవిధంగా పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బోధ నేతల సిబ్బంది సంఘం అధ్యక్షులు బుక్య రాజు ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ వైస్ ఛాన్స్లర్ కళాశాలలోని సమస్యలను పరిష్కరించుటకు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.

Related posts

31 వరకు, అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశ గడువు!

Sambasivarao

పురాతన శివాలయం నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలి

Jaibharath News

రాజస్థాన్ కు చెందిన సైబర్‌ నేరస్థుడు అరెస్టు