April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)గ్రామపంచాయతీల లో పనిచేసే పారిశుధ్య సిబ్బందికి కనీస వేతనం రూ. 25వేల రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని జిల్లా గ్రామ పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో ఆత్మకూరు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పాశుద్ధ సిబ్బంది కమిటీ నాయకులు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో పనిచేసే సిబ్బందికి కనీస వేతనము అందక అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు మందకృష్ణ మాదిగకు ఆ వివరించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ గ్రామపంచాయతీలో పని చేసే పారిశుద్ధ్య సిబ్బందికి తగిన ఆరోగ్య భద్రత , కనీస వేతనము ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీనికోసం ఆందోళన చేపడతామని ఆయన అన్నారు.ఈ సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బంది జిల్లా కమిటీ నాయకులు తనుగుల నరేష్, గణిపాక శ్రీను, తదితరులు పాల్గొన్నారు

Related posts

జనం నుంచి వనం లోకి వెళ్లిన సమ్మక్క సారలమ్మ దేవతలు*ఆఖరి రోజున భక్తులతో కిటకిటలాడిన అగ్రంపహాడు

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలి: ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు ప్రశాంత్

prajavani ప్రజావాణి వినతులను వెంటనే పరిష్కరించాలి-హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య