వరంగల్ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సీపిని కలిసేందుకు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గది (లౌంజ్)ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సోమవారం ప్రారంభించారు.సందర్శకులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ లౌంజ్ ఏర్పాటు చేయబడింది. ఇందులో కూర్చునే సౌకర్యాలు, త్రాగునీటి సదుపాయం, పత్రికలు వంటి అవసరమైన సౌకర్యాలు కల్పించబడ్డాయి.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ – “ప్రజలు పోలీస్ కార్యాలయానికి వచ్చే సందర్భంలో వేచి ఉండే సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ లౌంజ్ ఉపయోగపడుతుంది. ప్రజలకు సౌకర్యం కల్పించడం మా ప్రాధాన్యత” అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ లు రవి, ప్రభాకర్ రావు, శ్రీనివాస్, ఏసీపీలు జితేందర్ రెడ్డి, నాగయ్య, డేవిడ్ రాజు తో ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
