టిపియూఎస్(తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం) రాష్ట్ర లీగల్ విభాగం అధ్యక్షుడిగా శ్రీకృష్ణ యాదవ్ పులిగిల్ల ని నియమిస్తూ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సామ వెంకటరెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు మియాపురం నాగేశ్వర్ మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కలసాని సంజయ్ రెడ్డి హైదరాబాదులో ని మాదాపూర్ కార్యాలయంలో ఉత్తర్వులు అందజేశారు..
ఈ సందర్భంగా శ్రీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రైవేటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని,సంఘం బలోపేతానికి అభివృద్ధికి తోడ్పడుతానని తెలియజేశారు.
తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అధ్యక్షులు సామ వెంకటరెడ్డి మరియు కలసాని సంజయ్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపాడు.
కార్యక్రమంలో ముద్దం రవితేజ, శ్రీధర్,మదన్మోహన్, శ్రీకాంత్ ప్రకాష్, శ్రావణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

previous post
next post