Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వరద నీటిలో కొట్టుకుపోయి యువకుడు మృతి

(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)
మొంథా తుఫాన్ ఓ కుటుంబం లో విషాదం నింపింది.
మొంథాతుఫాన్ ప్రభావం వల్ల వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురవడంతో  వరద నీటిలో కొట్టుకుపోయి యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటన శివనగర్ మైసమ్మ నగర్ లో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఖమ్మం హైవే పై ప్రవహిస్తున్నటువంటి వరదనీటిని దాటే క్రమంలో గీసుకొండ మండలం రాంపురం గ్రామపంచాయతీ పరిధిలోని గట్టుకిందపల్లికి చెందిన పులి అనిల్ (35) తన బైక్ తో సహా గల్లంతయ్యాడు.24 గంటలు గడిచిన తర్వాత  అనిల్ మృతదేహం దొరకడంతో కుటుంబ సభ్యులు దుఃఖ సముద్రంలో ఉన్నారు.శవ పరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చురీకి మృతదేహాన్ని తరలించిన పోలీసులు

Related posts

శ్రీరామకృష్ణ మోడల్ స్కూల్ లో శ్రీకృష్ణ జన్మష్టామి వేడుకలు

గీసుకొండ మండలంలో పదవ తరగతి వార్షీక పరీక్షలు ప్రశాంతం ఎంఈఓ సత్యనారాయణ

కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని నిర్మాణాల పనుల సందర్శన