జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
వరద ప్రభావిత ప్రాంతాలలో వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటూ వైద్యాధికారులు సిబ్బంది వచ్చే వారం రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ డి .రవీంద్ర నాయక్ ఆదేశించారు.ఆదివారం ఆయన హనుమకొండ వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ ఏ అప్పయ్య డాక్టర్ బి సాంబశివరావు లతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి అక్కడ తీసుకుంటున్న చర్యలు మరియు నిర్వహిస్తున్న వైద్య శిబిరములను పరిశీలించారు. అమరావతి నగర్ ప్రగతి నగర్ లను సందర్శించి అమరావతి నగర్ లో నిర్వహిస్తున్న వైద్య శిబిరమును సందర్శించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి వైద్యాధికారి డాక్టర్ మాలికను గత మూడు రోజులుగా వారి పరిధిలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే వివరాలు , నిర్వహిస్తున్న వైద్య శిబిరములు , క్యాంపులకు చికిత్స నిమిత్తం ఎలాంటి సమస్యలతో వస్తున్నారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నీరు నిలువ ఉండడం , నీరు,ఆహార పదార్థాలు కలుషితం కావడంకావడం , పరిశుభ్రతకు సంబంధించిన సమస్యల వల్లఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి వారం రోజులపాటు అప్రమత్తంగా ఉంటూ ఇంటింటి సర్వే నిర్వహిస్తూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తూ అవసరమైన వారిని పిహెచ్సికి రిఫర్ చేయాలని అలాగే కలుషిత నీరు ఆహార పదార్థాల ద్వారా డయేరియా ,డీసెంట్రీ వంటి వ్యాధులు రాకుండా వారికి త్రాగునీరు అలాగే తినే ఆహార పదార్థాల గురించి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించాలన్నారు. మున్సిపల్ ముఖ్య ఆరోగ్య అధికారి డాక్టర్ రాజారెడ్డి తీసుకుంటున్న చర్యలను వివరించారు. వరంగల్ నగరంలో ప్రాంతాలను పరిశీలించిన అనంతరం హనుమకొండ డిఎంహెచ్ఓ కార్యాలయంలో డి ఎం హెచ్ వో లు,ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పరిస్థితిని సమీక్షించిన అనంతరం వచ్చే వారం రోజులపాటు వైద్యాధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని , కలుషిత నీరు కలుషిత ఆహార పదార్థాల వలన అలాగే దోమల వలన వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ సిబ్బందితో సమన్వయంగా పనిచేస్తూ ఉండాలని, ప్రోగ్రాం అధికారులు క్షేత్రస్థాయిలో గృహ సర్వే, వైద్య శిబిరముల నిర్వహణ, పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడంలో వైద్యాధికారులు, సిబ్బందితో సమన్వయంగా పని చేయించాలన్నారు.నీటి నిల్వల వలన లార్వా వృద్ధి చెంది దోమల ద్వారా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి కార్పొరేషన్ సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ యాంటీ లార్వా నివారణ చర్యలు అలాగే ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ ఏ అప్పయ్య, వరంగల్ డిఎంహెచ్వో డాక్టర్ బి సాంబశివరావు అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ టి మదన్మోహన్రావు , టీబీనియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఇక్త దార్ అహ్మద్ , డాక్టర్ జ్ఞానేశ్వర్,డాక్టర్ మంజుల, జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డివరంగల్ డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్ ప్రకాష్ డాక్టర్ కొమురయ్య , డాక్టర్ మోహన్ సింగ్,డాక్టర్ విజయకుమార్, డాక్టర్ ఉదయరాజ్ డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

