Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మేడారం జాతర భక్తుల సౌకర్యార్థం హోర్డింగ్ పాయింట్లు ఏర్పాట్లు

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు న్యూస్):
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా జాతీయ రహదారి ఎన్‌హెచ్–163 పై ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా హోల్డింగ్ పాయింట్లను గుర్తించామని ఆత్మకూరు సీఐ సంతోష్ తెలిపారు. ఇందులో గుడెపాడు, నీరుకుళ్ళ క్రాస్, కాటాక్ష్‌పూర్ ప్రాంతాలను హోల్డింగ్ పాయింట్లుగా నిర్ణయించామని అన్నారు.ఈ నేపథ్యంలో బుధవారం ఆయా హోల్డింగ్ పాయింట్లలో విస్తృతంగా శుభ్రత పనులు చేపట్టడంతో పాటు, “మేడారం జాతర–2026 హోల్డింగ్ పాయింట్” అనే సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ సిఐ సంతోష్ తెలిపారు.మేడారం జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపడుతున్నామని, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని సిఐ సంతోష్ పేర్కొన్నారు.

Related posts

వనదేవతలను దర్శించుకొన్న అడిషనల్ కలెక్టర్ దంపతులు

Jaibharath News

మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మేల్యే ధర్మారెడ్డి

Jaibharath News

అమరుల ఆశయాలను కొనసాగిద్దాం.