April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాల సంస్కృత విభాగాధ్యక్షునిగా హరికుమార్ !

(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ) హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సంస్కృత విభాగ నూతన అధ్యక్షునిగా వేదాంతం హరికుమార్‌ను నియమిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పదవిలో ఆయన 1 సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. సంస్కృత విభాగంలో విద్యా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం, విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, డాక్టర్ చందర్, డాక్టర్ పుల్ల రమేష్, ఇతర అధ్యాపకులు వేదాంతం హరికుమార్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.సంస్కృత విభాగ అభివృద్ధికి ఆయన నాయకత్వం దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

ముస్త్యాలపల్లిలో శ్రావణ మాసం పోచమ్మ బోనాల పండుగ

*78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

ఎమ్మెల్యే సతీష్ కుమార్ జన్మదిన వేడుకలలో వీరభద్రస్వామి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు

Jaibharath News