(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
ఆత్మకూరు మేజర్ గ్రామపంచాయతీ లో ఎలక్ట్రిషన్ గా విధులు నిర్వహిస్తున్న పొగాకుల రాజ్ కుమార్ ప్రమాదవశాత్తు జారి పడటంతో తలకు తీవ్ర గాయాలు కాగా ఆయనను వరంగల్ ఎంజిఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరీ రాజు కుటుంబ సభ్యులను ఓదార్చి తక్షణ సహాయం కింద పదివేల రూపాయలు అందించి ఓదార్చారు. మీ కుటుంబానికి మేము అండగా ఉంటామని సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు భరోసా ఇచ్చారు. ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శించి ఓదార్చారు. వార్డు సభ్యులు తనుగుల సందీప్, భయ్యా కుమారస్వామిలు, పరామర్శించే ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు

