జై భారత్ వాయిస్ దామెర
దామెర మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం దామెర మండలంలోని ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో అభిమానుల కోలాహలం నడుమ ఎమ్మెల్యే ధర్మారెడ్డి జన్మదిన సంబురాలు జరిపారు. పెద్ద సంఖ్యలో టపాసులు పేల్చి, ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి తన జన్మదిన కేక్ కట్ చేసి తినిపించిన తరువాత అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఊరుగొండ సర్పంచ్ గోగుల సత్యనారాయణరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో
సత్యనారాయణరెడ్డిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గజ మాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాగితాల శంకర్, జడ్పీటీసీ గరిగె కల్పనకృష్ణమూర్తి, రైతుబంధు కోఆర్డినేటర్ బిల్లా రమణారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల చైర్మన్ పోలం కృపాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ జాకీర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గండు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ముదిగొండ కృష్ణవ మార్తి, దళితబంధు చైర్మన్ గరిగె కృష్ణమూర్తి, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు సిలువేరు నర్సయ్య, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ దాడి మల్లయ్య, సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి ఈశ్వర్, వీఆర్ఎస్ దామెర శాఖ అధ్యక్ష కార్యదర్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు