Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మిలాద్-ఉన్-నబీ వేడుకలు 

దామెర మండలంలో పలు గ్రామాల్లో ముస్లింలు మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా గురువారం దామెర మండలం ఒగ్లాపూర్ లోని సైలానిబాబా దర్గా అవరణలో పీఠాధిపతి హమీద్ షా మియా (సైలానీబాబా) ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు మండలంలోని మజీద్ వరకూ మిలాద్-ఉన్-నబీ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి ఒగ్లాపూర్ లోని సైలానిబాబా దర్గా అవరణలో పీఠాధిపతి హమీద్ షా మియా సమక్షంలో బైక్ వ్యాలీ ముగించారు. సైలానిబాబా దర్గా ప్రాంగణాల్లో ప్రత్యేక నమాజ్, ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రాంతాల నుంచి పీఠాధిపతులు నవీద్ బాబా, రషీద్ బాబా, అమెర్ బాబా, ఎస్.కె.మోయిన్(ఖాదీమ్-ఏ-సైలానియా) అహ్మద్, తదితరులు పాల్గొన్నారు. అలాగే ఊరుగొండలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జాకీర్, మజీద్ పెద్దలు పాల్గొన్నారు.

Related posts

ఆర్ట్స్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలి!

తెలంగాణలో రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తాం సిఎం రేవంత్ రెడ్డి

తిరుమలగిరి లో సీతారాముల కళ్యాణం