April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి

జై భారత్ వాయిస్ ఆత్మకూరు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని ఆత్మకూరు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు ఈర్సల సదానందం అన్నారు.బిజెపి మండల అధ్యక్షుడు సదానందం మాట్లాడుతూ గూడప్పాడు గ్రామపంచాయతీ నిధులు ఖర్చు చేయలేని పరిస్థితిలో సర్పంచ్ పాలన ఉన్నది గ్రామపంచాయతీకి కేంద్రం ఇచ్చే ఈజీఎస్ నిధుల తోనే గ్రామంలో సిసి రోడ్లు డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాలు స్మశాన వాటిక ఎల్ఈడి బల్బులు కేంద్రం నిదులతో అభివృద్ధి తోనే పనులు చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏమాత్రం రాలేదు గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పది లక్షలు కూడా గ్రామానికి రాలేదు గ్రామంలో ఉన్న 40 లక్షల నిధులు ఖర్చు చేయలేని పరిస్థితుల్లో సర్పంచి ఉన్నారని తెలిపారు.కొన్ని గ్రామాలలో చేసిన పనులకు బిల్లులు రాక అవస్థ పడుతుంటే నిధులు ఉన్న ఖర్చు చేయకపోవడం విడ్డూరం గ్రామపంచాయతీ లో అవకతవకలు జరిగినయి అని ఉప సర్పంచ్ ఎంపిటిసి పిర్యాదు చేసిన విచారణ చేయకుండా అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉంటున్నారని అన్నారు అధికార పార్టీ సర్పంచ్ అయినందున చర్యలు శూన్యం ఇప్పటికైనా గ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలొబిజెపి మండల అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం ఆర్టిఐ జిల్లా కన్వీనర్ ఎదులాపురం శ్రవణ్ కుమార్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఉప్పుగల శ్రీకాంత్ రెడ్డి బీజేవైఎం పోరెడ్డి ప్రదీప్ రెడ్డి సోషల్ మీడియా మండల కన్వీనర్ బలభద్ర దినేష్ బూత్ అధ్యక్షులు ప్రశాంత్ పాల్గొన్నారు

Related posts

ఆదర్శ పాఠశాల పనులు వేగవంతం చేయాలి – పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

Jaibharath News

పెద్దాపురం లో గృహలక్ష్మి మంజూరు పత్రాలు పంపిణీ

Jaibharath News

పేద రెడ్ల అభ్యున్నతికి కృషి’

Jaibharath News