April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
సిద్దిపేట జిల్లా

కోనాయపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిదిలో నామినేషన్ పత్రాలకు పూజ చేసిన సీఎం కేసీఆర్

తనకిష్టదైవమైన కోనాయపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేశారు. శనివారం కోనాయపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లిన సీఎం కేసీఆర్ గారికి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని ఆలయం లోకి సీఎం ప్రవేశించారు. నామినేషన్ పత్రాలను ఆలయ అర్చకులకు అందించగా మూలవిరాట్టు వద్ద పత్రాలు ఉంచి  సీఎం కేసీఆర్  గోత్ర నామాలు, సంకల్పంతో పూజలు నిర్వహించారు.అర్చకులు కేసీఆర్ గారి చేతికి కంకణధారణ చేసి తీర్థ ప్రసాదాలు అందించి వేదాశిర్వచణం అందించారు. అనంతరం ఆలయ ఆవరణలోనే వేంకటేశ్వర స్వామి సన్నిధిలో నామినేషన్ పత్రాల పై సీఎం కేసీఆర్  సంతకాలు చేశారు.పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయం నుండి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మహిళలు విజయ తిలకం దిద్దారు.
కేసీఆర్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ హర్షధ్వానాలు చేశారు. హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ విజయం తథ్యం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అత్యంత అభిమానంతో  గులాబీల వర్షం కురిపించారు.
కాగా ప్రధాన ముఖద్వారం దక్షిణం వైపు ఉండడం ఇక్కడి కొనాయిపల్లి దేవాలయం ప్రత్యేకత .ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంట మంత్రి హరీశ్ రావు,  ఎంపీలు..జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బిఆర్ఎస్ నేత శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

శతాధిక మాతృమూర్తి ఆకుల ఐలమ్మ కన్నుమూత