April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

నారాయణ స్వామి మృతి కాంగ్రెస్ కు తీరని లోటు

ఉడుత నారాయణస్వామి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
-కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ కమలాపురం రమేష్

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)

పరకాల శాసనసభ్యుడు పరకాల నియోజవర్గ ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం నీరుకుల్ల గ్రామం ఆత్మకూరు మండలం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉడుత నారాయణస్వామి దశదిన కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్ హాజరై ఉడుత నారాయణస్వామి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణస్వామి కుటుంబం మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి ఏనలేని సేవలు చేశారని అటువంటి కుటుంబంలో నారాయణస్వామి చిరస్థాయిగా నిలిచి ఉండే వ్యక్తి ఆని కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు గొప్పవని అన్నారు. అటువంటి నాయకుడిని కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వారి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మకూరు ఎంపీటీసీ వాసు, ఆత్మకూరు పిఎసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్, ఆలువాల రవి, నీరుకుల్ల గ్రామ పార్టీ అధ్యక్షులు కిన్నెర ప్రేమ్ చంద్ ,గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ ,నీలం రాజు ,మాజీ సర్పంచ్ ఉడుత సంగీత మహేందర్ ,జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు కోడేపాక కుమార్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కిన్నెర రాజేందర్, కిసాన్ సెల్ నాయకులు కీత రాజు ,అన్నదాత ఫర్టిలైజర్ ఆర్షంకుమార్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ కోటి ,ఆర్షం అనిల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఓటు హక్కుపై వినియోగంపై అవగాహన

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Jaibharath News

వరంగల్ జిల్లాలో డబ్ల్యూజేఐ ఆవిర్భావం