Jaibharathvoice.com | Telugu News App In Telangana
కృష్ణా

డూలాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వితంతువులకు, అనాధలకు, పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ

నందిగామ జైభారత్ వాయిస్
నందిగామ మండలంలోని మునగచర్ల శివారు డూలాస్ ట్రస్ట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనాధ పిల్లలకు, వితంతువులకు, నిరుపేదలకు డూలాస్ ట్రస్ట్ వితరణతో అందజేసిన నూతన వస్త్రాలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటి వారికి సహాయపడుతూ.. పేదలకు అండగా నిలుస్తూ డూలాస్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ట్రస్ట్‌ సేవలు పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ చేపట్టాలని సూచించారు. అదేవిధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డూలాస్ ట్రస్ట్ నిర్వాహకులు పగిడిపల్లి దేవసహయం, మణీ ఆనంద్ లను ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Related posts

నూకాలమ్మ అమ్మవారి సేవలో మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్

ఐ.ఆఫ్.డబ్లు.జె 2024 డైరీని సజ్జల రామకృష్ణరెడ్డి ఆవిస్కరించారు

Jaibharath News

రాష్ట్ర సచివాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ణ

Jaibharath News