April 5, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు మండల మహిళా మోర్చ అధ్యక్షురాలుగా శ్రీలత

మహిళా మోర్చా ఆత్మకూరు మండల అధ్యక్షురాలిగా శ్రీలత
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
ఆత్మకూరు మండల కేంద్రం లోని మోడల్ కాలనీ కి చెందిన వేములపల్లి శ్రీలత ను భారతీయ జనతా మహిళా మోర్చా ఆత్మకూరు మండల అధ్యక్షురాలుగా
నియమించడం జరిగింది. ఈ మేరకు మండల కేంద్రం లో జరిగిన కార్యక్రమం లో నియమించారు.
ఈ నియామకం బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకం చేయడం జరిగిందని మండల బి జె పీ అధ్యక్షుడు ఇర్శడ్ల సదానందం తెలిపారు. ఈ సందర్బంగా శ్రీలత మాట్లాడుతూ బి జె పి అభివృద్ది కోసం పాటు పడతానని అన్నారు.
ఈ కార్యక్రమంలో
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
డాక్టర్ పెసర్ విజయ చందర్ రెడ్డి , బిజెపి అధికార ప్రతినిధి కృష్ణ ప్రసాద్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు
ముత్యాల శ్రీనివాస్ గౌడ్ , బిజెపి మండల అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం ,బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు ఉప్పు గళ్ళ శ్రీకాంత్ రెడ్డి, బలవంతుల రాజు, మండల కార్యదర్శులు జిట్టే మధు, బయ్య పైడి, పిసాల సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆత్మకూరు లో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Jaibharath News

ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు కాజీపేట దర్గా ఉరుసు ఉత్సవాలు

సిడిఎంఏ వీపీ గౌతమ్ గ్రేటర్ వరంగల్ లో పర్యటన