April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణం వైభవంగా జరిగింది

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంలోని  కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణం గురువారం రాత్రిఅంగరంగ వైభవంగా జరిగిం ది. గీసుకొండ, దుగ్గొండి మండలంలోని వివిధ గ్రామాలభక్తులు అధిక సంఖ్యలో  వేడుకకు హాజరై తిలకించారు. కళ్యాణానికి ముందు  గుట్టపైన ఆలయంలో నిత్య హోమము భేరీ పూజ కల్యాణానికి సమస్త దేవతలను ఆహ్వానించే పూజలు దేవాలయ వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసచార్యులు కాండూరి రామాచార్యులు  నిర్వహించారు. . వేదమంత్రాల నడుమ కల్యాణలో  మాంగళ్యధారణ, తలంబ్రాలు బాజా భజంత్రీల మధ్య ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసా చార్యులు,  రామాచార్యు లు, విష్ణుఆచార్యులు, ఫణీంద్రాచార్యులు, నిర్వహించారు
ఈ కార్యక్రమంలో గీసుకొండ  ఎం పీపీ భీమగాని సౌజన్య, ఎంపీటీసీ గోపాల్, కాం గ్రెస్ నాయకులు చాడ కొమురారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్  సాయిలి ప్రభాకర్, అంతకి నాగేశ్వరరావు, స్వామి, అమ్మి,రాజయ్య దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 

Related posts

నిరాదరణ కలిగిన బాలలకు విద్య అందించుట అందరి లక్ష్యo వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని కలిసిన పద్మశాలి కులస్థులు

Jaibharath News

రాయపర్తి యువతలో పరవశించిన దేశభక్తి