Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

పదోన్నతిపై బదిలీ అయిన బ్యాంకు ఉద్యోగి రమేష్ కు ఘన సన్మానం

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ యూనియన్ బ్యాంక్ లో 18సంవత్సరాల సుధీర్ఘ కాలం విశిష్ట సేవలందించి, పదోన్నతిపై భూపాలపల్లి బ్యాంకుకు బదిలీ అయిన రమేష్ ని ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా బ్యాంకు మేనేజర్ వి. విజయ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో బదిలీ అయిన రమేష్ నుగీసుకొండ యూనియన్ బ్యాంక్ మేనేజర్ , స్టాఫ్ మరియు ఐకెపి ఉద్యోగులు, పలువురు గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో గీసుకొండ మాజీ సర్పంచ్ దౌడు బాబు,యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ బి. రమ్య, సబ్ మేనేజర్ హనుమాన్ సింగ్, ఐకెపి సిసీలు కోల శోభారాణి, పొగాకు సుజాత, ప్రభుత్వ ఉపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి, ఐకెపి వివోఏలు జనార్ధన్, రవి, భవానీ, రజిత తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి డిఎం& హెచ్ఓ డాక్టర్ కాజీపేట వెంకటరమణ

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 14 పార్లమెంట్ సీట్లు మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు

Jaibharath News

గీసుకొండ మండలంలో ఉచిత వైద్య శిబిరాలు