జగన్ కార్మికులను బిచ్చగాళ్లుగా మార్చాడు.
కళ్యాణదుర్గం జీవనాడి బీటీపీ పూర్తి చేసి నీళ్లిస్తాం
ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో లో అమిలినేని
జై భారత వాయిస్, కళ్యాణదుర్గం
అనంతపురం జిల్లా బ్రహ్మాసముద్రం మండలం గుండిగానిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారనికి వచ్చిన *కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి ఘజమాలతో పాటు కురుబలు కంబలి, గొర్రె పిల్ల ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా అమిలినేని మాట్లాడుతూ కార్మికులు సుఖ సంతోషాలతో ఉండాలని, వారిని జగన్ ప్రభుత్వంలో కార్మికులను బిచ్చగాళ్లుగా తయారుచేసాడు. కార్మికులకు పనులు లేక వలసలు వెళ్లారు. ప్రతి ఏడాది కార్మికుల దినోత్సవం ప్రభుత్వం నిర్వహించేది.. ఈ సైకో జగన్ దాన్ని నిర్వీర్యం చేశారు.. మనం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఘనంగా కార్మికుల దినోత్సవాన్నిజరుపుకుందాం..కళ్యాణదుర్గం ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం ఇక్కడ సాగు, తాగు నీరు చాలా అవసరం.. నియోజకవర్గానికి జీవనాడి అయిన బీటీపీ కాలువ తవ్వి పూర్తి చేసి రెండేళ్లలో సాగు నీరు తీసుకువస్తాం. బీటీపీ నీళ్లు వచ్చేది మొదటగా నీగ్రామానికే కాబట్టి తప్పకుండా నీళ్ళు ఇస్తాం. నీళ్లు వస్తే బోర్లు రీఛార్జ్ అవుతాయి కాబట్టి మా ముందున్న లక్ష్యం సాగు, తాగు నీరు ఇవ్వడమే కాకుండా గ్రామాల్లో ఉన్న సమస్యలు తీర్చి మీకు మంచి చేస్తా..కానీ మంచి చేయాలానే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్తిగా మీ ముందుకు వచ్చా ఆశీర్వదించండి. రాక్షస పాలనకు చరమ గీతం పాడాలంటే అందుకు మే 13న ప్రతి ఒక్కరుసైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలనిఅభ్యర్థించారు..కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకుల బ్రహ్మాసముద్రం మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ, బిజెపి పార్టీల, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.