Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ఎన్నికల ప్రచారంగా భాగంగా రోడ్ షో అమిలీనేని

ల్యాండ్ డీడ్ చట్టంతో మనకు అన్యాయం చేయాలని చూస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో లో అమిలినేని

జై భారత వాయిస్,, కుందుర్పి

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారనికి వచ్చిన కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి ఘజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా అమిలినేని మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా తెచ్చిన ల్యాండ్ డీడ్ చట్టంతో తెచ్చిన మన భూములను మనకు కాకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, మన భూముల పాసుపుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫొటో వేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేయించుకునే భూములకు వరిజినల్ పత్రాలు ఇవ్వకుండా జిరాక్స్ కాపీలు ఇస్తాడంటే మనకు ఏమి హక్కులు లేకుండా పోతాయని అందరు గుర్తుంచుకోవాలన్నారు…
నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మూడేళ్లలోపు రోడ్లు నిర్మించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తా.. బీటీపీ కాలువ, కుందుర్పి బ్రాంచ్ కేనాల్ పనులు రెండున్నరేళ్లలో పూర్తి చేసి సాగు, తాగు నీరిచ్చి ప్రజల ఋణం తీర్చుకుంటా…గ్రామాల్లో అవసరమైన మౌళిక వసతులు కల్పించి గ్రామాలు అభివృద్ధి చేసి చూపిస్తానని, పరిశ్రమల కోసం తిమ్మసముద్రం ప్రాంతంలో ఉన్న భూమిలో విద్యుత్, నీళ్ళు, రోడ్లు వేయగలిగితే పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని అందులో మన ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, మరికొదరికి ఉపాధి లభిస్తుందన్నారుసభలో అమిత్ షా కూడా చెప్పారు రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని, పోలవరం పూర్తయితే పట్టిసీమ ద్వారా కృష్ణా నది నీళ్లు మనకు వస్తాయని వాటి ద్వారా మన ప్రాంతానికి మరింత ఎక్కువగా సాగు, తాగు నీళ్లు వస్తాయన్నారు..
అలాగే గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించి అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అందుకు మే 13న ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు..కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, కుందుర్పి మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Related posts

ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో తొలగిన ఎస్ ఎస్ వర్గీకరణ అడ్డంకులు

Gangadhar

ఏ ఆర్ తో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉమా మహేశ్వర

Jaibharath News

భారీ మెజారిటీతో గెలిపోందిన సురేంద్రబాబును మహిళలు ప్రత్యేక పూజలు

Jaibharath News