జగన్ స్వార్థనికి అన్ని ప్రాజెక్టలను నిర్వీర్యం చేసాడు.
మీడియా మిత్రులపై దాడులు హేయం.
జై భారత వాయిస్, కళ్యాణదుర్గం,,
కళ్యాణ్ దుర్గం తెదేపా అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ల మీడియా సమావేశం.అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటన కవరేజ్ కోసం వెళ్లిన ఈనాడు మీడియా విలేకరిపై ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీ గుండాలు దాడులు చేసినా పట్టించుకోలేదని, ఇలాంటి దాడులను ముఖ్యమంత్రి ఎలా సమర్థిస్తారో అర్థం కావడం లేదని ఇప్పటి వరకు కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇలాంటివి జరగలేదని ఇప్పుడు జరుగుతున్నాయి అంటే వైసీపీ నాయకులు ఎంతటికైనా తెగిస్తారని అర్థం అవుతోంది.. ఇప్పటికైనా ఎన్నికల కమీషన్ వీటిపై చర్యలు తీసుకోవాలన్నారు….
బీటీ ప్రాజెక్టుకు నీటిని తరలించే కాలువ పనులు ఆపించింది రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పనులు జరుగుతున్న బీటీపీ ప్రాజెక్టును నిలిపివేయాలని ప్రభుత్వానికి లేఖ రాసి ఈ ప్రాంత ప్రజలకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ద్రోహం చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పనులు ఆపించినా కళ్యాణదుర్గం మంత్రి ఉష శ్రీచరణ్ కనీసం నోరు విప్పలేదు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వైకాపా మంత్రి.. రాప్తాడు ఎమ్మెల్యే తీవ్ర ద్రోహం చేశారు.కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ
బీటీ ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్న జగన్ ఎప్పుడూ పట్టించుకోలేదు, మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్ మాట తప్పాడు మడమ తిప్పాడు..ఇవాళ్టి సభలో జగన్ కనీసం బీటీపీ ప్రాజెక్ట్ పై మాట్లాడలేదు… ప్రాజెక్టుకు నీళ్లు తీసుకురావాలనే ఉద్దేశము జగన్ కు ఏ కోశానా లేదు. బీటీపీ ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా కళ్యాణదుర్గం ప్రజలను జగన్ మరోసారి మోసం చేస్తున్నారు. నీటి ప్రాజెక్టు పూర్తయి కళ్యాణదుర్గానికి, రాయదుర్గానికి నీళ్లు రావాలంటే తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించుకోవాలి. కళ్యాణదుర్గంలో తెదేపా అభ్యర్థి ఆమిలినేని సురేంద్రబాబు, రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులను గెలిపించుకుంటే ఈ రెండు నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయి. కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాలకు న్యాయం చేయకుండా కేవలం మాటలు చెప్పి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డికి బుద్ది చెప్పాలని, కేవలం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థులు అయిన కాలువ శ్రీనివాలు, అమిలినేని సురేంద్ర బాబు లను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని అభ్యర్థించారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాడని ఈ ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదం.. బీజేపీ వాల్ల్య్ ఎక్కడా కూడా రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పలేదు.. ఈ చేత కానీ ముఖ్యమంత్రి కూటమికి బయపడి తన ఓటమి కాయమని ఇలా ముస్లిం ల ఓట్లు చీల్చాలానుకోవడం చాలా దారుణం.. ప్రజలకు ఏమి చేయాలో తెలియక ఎదో ఒకటి చెప్పాలని ఇలా మాట్లాడుతున్నాడు.. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు అమిలినేని సురేంద్ర బాబు, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ లను మంచి మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు..