కలియుగతత్వవేత్త పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 16వ శతాబ్దంలో లిఖించిన కాలజ్ఞాన అంశాలు ఆత్మజ్ఞానానికి చెందిన ప్రకృతి పరమార్ధమని కాకినాడలొనిభోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. వైశాఖ దశమి రోజున వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన సందర్భంగా శనివారంనాడు కాకినాడలొని పీఠంలోఉదయం గురుపూజలు నిర్వహించి కాలజ్ఞాన గ్రంథప్రవచనం నిర్వహించారు. ధర్మా చరణే భక్తి తత్వమని జగద్గురువు శంకరాచార్యవలె వీరబ్రహ్మేంద్రస్వామి అభ్యుదయ సంస్కరణతో జగద్విఖ్యాతి పొందారని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. బ్రహ్మం గారిఆరాధనతో బ్రహ్విష్ణు మహేశ్వర త్రినాథ వ్రత ఫలితం లభిస్తుందన్నారు. తొలుతగా గణపతి పూజ శ్రీవారి 30వ జపయజ్ఞ పారాయణ జరిగింది. ఈ ఆరాధనోత్సవంలో శ్రీవారి సమాజం సభ్యులు సుబ్బలక్ష్మి ,శ్రావణి, వరలక్ష్మి, పద్మజ, ఆదిలక్ష్మి, మంగతాయారు, కాంతం శైలజ, మణిసంధ్యరెడ్డి వర్మ, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

previous post