అనారోగ్యంతో ప్రభుత్వ ఉద్యోగి మృతి
జై భారత వాయిస్, కుందుర్పి
శ్రీ సత్య సాయి జిల్లా రామగిరి మండలం పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కంబదూరుకు చెందిన సి చిన్నయ్య 52 అనారోగ్యంతో మంగళవారం రాత్రి కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన గతంలో కంబదూరు, కుందుర్పి మండలాల్లో పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో గా విధులు నిర్వహించారు. మృతిపై పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగం కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని వారి కోరారు.