జై భారత్ వాయిస్ కాకినాడ
(గణపతిపీఠంలో 33వ జపయజ్ఞపారాయణ)
చైత్రశుద్ధపాడ్యమినుండి5రోజుల పాటు తిరుమల శ్రీవారి క్షేత్రం లో ఆకాశగంగ బాలఆంజనేయ ఆలయాల్లో హనుమ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని కాకినాడ భొగిగణపతి పిండం ఉపాసకులు రమణరాజు తెలిపారు.19తేది నుండి 21వరకు జ్యేష్ట్యాభిషేకం 20న నాథమునుల వర్ష తిరు నక్షత్రం 22న గరుడ సేవ జరుగుతాయని భోగి గణపతి పీఠం తెలియజేసింది.శనివారం ఉదయం సుప్రభాత వేళలో పీఠంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పంచలోహాల పాదాల వద్ద జరిగిన శ్రీవారి 33వ జపయజ్ఞ పారాయణలో ఆరాధకులకు రవిక పసుపు కుంకుమ తాంబూలాలు పంపిణీ చేసారు. పీఠం లో జరిగిన కార్యక్రమం లో రమణరాజు మాట్లాడుతూ తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తులు కొండమీద అఖండ హరినామ సంకీర్తన మండపంలో గోవింద పారాయణ చేయడం వలన అద్భుత శక్తిపాతం కలుగుతుందని తెలియ జేసారు.

previous post
next post