నల్లపల్లి విజయ్ భాస్కర్ సస్పెన్షన్ రద్దు పై హర్షం
జై భారత వాయిస్, కుందుర్పి
కళ్యాణదుర్గం నియోజవర్గం కుందుర్పి మండలం మాయదార్లపల్లి లో పనిచేసే ప్రధాన ఉపాధ్యాయుడు , ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ సస్పెన్షన్ ను రద్దు పై మాయదార్లపల్లి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామం లోని ప్రాథమికొన్నత పాఠశాల విలీనం జరగకుండా ఉపాధ్యాయుడు విజయ్ భాస్కర్ క్రియాశీలకం గా వ్యవహరించారాని, ఉద్యోగులు, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్య ల పరిష్కరం కోసం చాలా కృషి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమం లో గ్రామస్తులు రంగప్ప, గోపాల్,పెద్దన్న, తిప్పేస్వామి, మంజప్ప, చరణ్, మర్రిస్వామి, బొమ్మలింగప్ప, జనార్దన్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు