కళ్యాణదుర్గం ఎంఈఓ ను బదిలీ చేయండి
జై భారత వాయిస్, కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ ను బదిలీ చేయాలని, కళ్యాణదుర్గం ఆర్డీవో రాణి సుస్మితకు వినతి పత్రాన్ని అందజేశారు జై భీమ్ సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విలియమ్స్, ఈ సందర్భంగా ఆయన ఆర్డిఓ ఇచ్చిన ఫిర్యాదులో మాట్లాడుతూ, కళ్యాణదుర్గం ప్రైవేట్ పాఠశాలలకు, అధిక ఫీజులు, పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్ముతున్న, నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయడం లేదని తల్లితండ్రులు ఫిర్యాదు చేసిన కూడా ఎంఈఓ, ఫోన్ ద్వారా చెబితే నేను చెయ్యను, నాకు పేపర్ ద్వారా కంప్లైంట్ ఇవ్వాలని సమాధానం చెప్పి ఫోన్ కట్ చేస్తుందన్నారు. అంతేగాక పాఠ్యపుస్తకాలు ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ ఎంఈఓ కు తెలిపితే, ఎంఈఓ ద్వారానే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు ఫోన్లు వెళ్లి, పాఠ్యపుస్తకాలు ఉన్న రూములను తాళాలు వేసుకొని వెళ్లిపోయేలాగా వీరే వారికి సలహాలిస్తున్నారు. ఇలాంటి ఎంఈఓ ఉండటం కంటే బదిలీ చేస్తే కళ్యాణదుర్గం మండలంలో పేద విద్యార్థులు చదువుకోటానికి అవకాశం ఉంటుందని, తక్షణమే కళ్యాణదుర్గం ఎంఈఓ ని బదిలీ చేయాలని ఆయన ఆర్డిఓ ని కోరారు. ప్రవేట్ పాఠశాలలకు పూర్తి సహకరిస్తున్న ఎఈఓ ని వెంటనే బదిలీ చేయాలని ఆయన విన్నతి పత్రం ద్వారా ఆర్డిఓ కి ఫిర్యాదు చేశారు.