A
అంగనవాడీల సమస్యలను పరిష్కరించండి సిఐటియూ
ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారికి వినతిపత్రం అందజేసిన అంగనవాడీలు
జై భారత వాయిస్, కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం పట్టణంలో స్దానిక ప్రజావేదిక వద్ద అంగనవాడీ సమ్మె ఒప్పందంలో అంగీకరించిన అంశాలను,మినిట్స్ కాఫీ ఆధారంగా జీవోలను ఇవ్వాలను కోరుతూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారికి సిఐటియూ నాయకులు, అంగనవాడీ యూనియన్ నాయకులు కలసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేసినారు.ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు అచ్యుత్ ప్రసాద్, అంగనవాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శకుంతల,కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ జీవో నెంబర్ 17 మార్పు చేయాలని కోరుతున్నాం. అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్ క్రింద మొదటి వర్కరికి 50వేల రూ నుండి లక్షరూ కు, హెల్పర్లు 20 వేల రూ నుండి 40వేల రూ.కు పెంచుతూ జీవో నెంబర్ 17 ఇచ్చారు. అయితే దీనిని మార్పు చేస్తూ మిట్స్ కాపీలో అంగీకరించిన విధంగా వర్కర్కు లక్ష 20వేల రూ. హెల్పర్కు 60 వేల రూ ఇచ్చే విధంగా జీవోను మార్పుచేయాలని కోరుతున్నాం.అంగన్వాడీలకు ఇంకా రావాల్సిన జీవోలు వెంటనే ఇప్పించాలనికోరుతున్నాం.రాష్ట్రంలో ఉన్న మొత్తం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలని కోరుతున్నాం. సర్వీస్లో ఉండి చనిపోయిన వారికి దహణ ఖర్చులు క్రింద 20 వేల రూ జీవో ఇవ్వాలని మరియు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగంలో ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రధానమంత్రి జీవిత భీమా అమలుచేయడానికి ఉత్తర్వులు జారీచేయాలని కోరుతున్నాం.సంక్షేమ పధకాలు అంగన్ వాడీలకు కూడా అమలు చేయాలి. సమ్మె కాలంలో పెట్టిన కేసులన్ని రద్దు చేయాలి.ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ ఆధ్వర్యంలో క్రింది అంశాలు పరిశీలన చేసి పరిష్కారానికి కృషిచేయాలని కోరుతున్నాం. సంపూర్ణపోషణ మెనూ, మెనూ ఛార్జీలు పెంపు, యాప్లు ఒకే యాప్లో మార్పు చేయాలని, 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీచేయాలని, వర్కర్లకు పంపిణీ చేసిన సెల్ఫోన్లు సమస్యలు, లబ్దిదారులకి నాణ్యమైన సరుకుల సరఫరా, వేసవిసెలవులు, తదితర సమస్యలు పరిష్కారం కోసం వెంటనే సబ్ కమిటీని ఏర్పాటుచేయాలని కోరుతున్నాం. సమ్మెకాలంలో చనిపోయిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు కూడా కనీసం దహన ఖర్చులు క్రింద 20వేల రూ.లు ఇప్పించాలని కోరుతున్నాం. అర్హత కలిగిన అంగన్వాడీలకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాం.అలాగే స్థానికంగా నెలకొన్న సమస్యలు సొంత భవనాలు లేనివి నియోజకవర్గంలో అంగనవాడీ సెంటర్లు అద్దె భవనాలలో నడుపుతున్నాం సొంత భవనాలు కట్టించాలని,శిధిలావస్థలో వున్న వాటిని మెరుగుపర్చాలని తెలియజేశాం స్పందిస్తూ అంగనవాడీల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాను సొంత భవనాలను నిర్మించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తి పరిష్కరిస్తానని తెలిపారు.. అంగనవాడీల సమస్యలపై అరగంట పాటు అంగనవాడీ కార్యకర్తలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకోవడం సంతోషకరం అని తెలిపారు కార్యక్రమంలో కళ్యాణదుర్గం ప్రాజెక్టు కార్యదర్శి పాతక్క,సెక్టార్ లీడర్స్తిప్పీరమ్మ,రాధ,విజయనిర్మల,ద్రాక్షాయణి,సువర్ణా,లక్ష్మీ,వరలక్ష్మి, సుధామణి,అపర్ణ,భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు…